ద్విపదభాగవతం - మధురకాండ : శ్రీకృష్ణుఁడు కారాగృహమునుండి దేవకీ వసుదేవులను విడిపించుట
కారాగృహంబునఁ గడునొచ్చి యున్న
వీరుని వసుదేవు, వెలఁది దేవకిని,
గని వారి కాలి సంకిలయ లుడ్పించి
వినయంబుతో మ్రొక్క వెఱఁగంది వారు
గోవిందహలులఁ గన్గొని తమపాలి
దైవంబులని, యాత్మఁ దలఁచిరి గాని
తనయభావంబుగాఁ దలఁచక యున్నఁ
తనమాయ హరి మోహతమముఁ గారించ
చన్నులఁ బాలును సమ్మదాశ్రువులు
కన్నులఁ దొరల నక్కాంతాలలామ
సుతులఁ గౌఁగిటఁ జేర్చి శోకంబుఁ దక్కి
యతులితంబగు ప్రేమ నందఁదఁ జూడ
వసుదేవుఁడును బుత్రవరుల నీక్షించి
యసమానమగు ప్రేమ నక్కునఁ జేర్చి
“పుణ్యాత్మ! మీ యట్టి పుత్రులఁ గాంచి
పుణ్యకీర్తులఁ గంటి పుణ్యుఁడ నైతి; - 260
నింతగాలము మిమ్ము నీక్షింపలేక
సంతాపమందుచు శత్రులచేతఁ
బడని బాధలఁ బడి పనువుచుండితిమి;
కడపట! నినుఁ జూడగంటిమి నేడు;
జన్మజన్మాంతర సంచితౌఘములు
చిన్మయ! నినుఁ దలఁచిన మాత్రమేఁగు
మహనీయ! నీవు కుమారుఁడ వైతి
నిహపరంబుల మాకు నేమిటఁ గొఱత?”
అనియున్న గురుల నత్యాదరలీలఁ
గనుఁగొని శౌరి యత్కటబాష్పుఁ డగుచు